Nov 15, 2013

కుజ దోషము

కుజ దోషము

కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును.

కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కుజ దోషము యొక్క పరిశీలన (Astrological analysis of Manglik Dosha)
వైదిక జ్యోతిష్యములో కుజుని లగ్నము, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ బావములో దోష పూరితముగా చెప్పబడును. ఈ బావములలో ఉపస్థితిలో వున్న కుజుడు వైవాహిక జీవితము కొరకు అనిష్టాకారకముగా చెప్పబడును. జన్మ కుండలిలో ఈ పంచ బావములు కుజునితో పాటు ఎంత క్రూరమైన గ్రహములుగా కూర్చొని వున్నవో కుజుడు అంతే దోషపూరితముగా వుండును. అనగా రెండ బావము క్రూరమువా వుండిన రెండింతలు, నాల్గవ బావము క్రూరముగా వుండిన నాల్గింతలు. కుజుని పాప ప్రబావములు వేరు వేరు విధములుగా ఐదు బావములలో దృష్టి కలిగి వుండును.

లగ్న బావములో కుజుడు (Mangal in Ascendant)
లగ్న బావము నుండి వ్యక్తి యొక్క శరీరము, ఆరోగ్యము, వ్యక్తిత్వము యొక్క విచారణ చేయబడును. లగ్న బావములో కుజుడు వున్న ఎడల వ్యక్తి క్రోదము మరియు ఉగ్ర స్వబావము కలవారై వుండును. ఈ కుజుడు వ్యక్తిని మొండిగాను మరియు ఎప్పుడూ గొడవపడే స్వబావము గలవాడుగా చేయును. ఈ బావములో ఉపస్థితిలో వున్న కుజుని దృష్టి చతుర్ధ బావ దృష్టి సుఖ స్థానములో వుండిన ఎడల గృహస్థ సుఖములలో లోపము ఏర్పడగలదు. సప్తమ దృష్టి జీవిత బావస్వామి స్థానములో వుండిన ఎడల భార్యా భర్తల మద్య విరోధములు మరియు దూరము కలుగుచుండును. అష్టమ బావముపై కుజుని యొక్క పూర్ణ దృష్టి జీవిత బాగస్వామికి సంఘటములను కలిగించును.

ద్వితీయ బావములో కుజుడు (Mangal in Second Bhava)
బావదీపిక నామక గ్రహములో ద్వితీయ బావస్థ కుజుడు కూడా కుజదోషము వలన పీడించబడగలడు. ఈ బావము కుటంబము మరియు ధనమునకు స్థానముగా వుండును. ఈ కుజుడు కుటుంబము మరియు బందుమిత్రులతో విరోధములను శృష్టించును. కుటుంబములో కలతలను ఏర్పరచి దాని కారణముగా బార్యా భర్తలలో అశాంతిని కలిగించును. ఈ బావము యొక్క కుజుడు పంచమ బావము, అష్టమ బావము మరియు నవమ బావమును చూస్తున్నాడు. కుజుని ఈ బావములలో దృష్టి కారణముగా సంతాన పక్షములో విపరీత ప్రభావము కలుగును. భాగ్యము యొక్క ఫలితములు బలహీన పడును.

చతుర్ధ బావములో కుజుడు (Mangal in Fourth Bhava)
చతుర్ధ స్థానములో కూర్చొని వున్న కుజుడు సప్తమ, దశమ మరియు ఏకాదశ బావములను చూస్తున్నాడు. ఈ కుజుడు మంచి స్థాయి, సంపత్తిని ప్రదానించును కాని గృహస్థ జీవితమును కష్టమయముగా చేయును. కుజుని యొక్క జీవిత బాగస్వామి యొక్క గృహముపై వుండిన వైచారికమైన మతబేదములు కలిగి వుండెదరు. మతబేదములు మరియు ఇరువురి మద్య అశాంతి కలిగి వుండుట వలన జీవిత బాగస్వామి యొక్క సుఖములలో లోపము ఏర్పడును. కుజ దోషము కారణముగా బార్య భర్తల మద్య వొడిదుడుకులు పెరిగి దూరముగా వుండవలసి వచ్చును. ఈ కుజుడు జీవిత బాగస్వామికి సమస్యలను కలిగించడు.

సప్తమ బావములో కుజుడు (Mangal in Seventh Bhava)
సప్తమ బావములో జీవిత బాగస్వామి యొక్క గృహముగా వుండును. బావములో కూర్చొని వున్న కుజుడు వైవాహిక జీవితము కొరకు అధికముగా దోషపూరితముగా వుండును. ఈ బావములో కుజ దోషము వుండుట కారణముగా జీవిత బాగస్వామి యొక్క ఆరోగ్యములో వొడిదుడుకులు వుండగలవు. జీవిత బాగస్వామి ఉగ్రముగాను మరియు క్రోదస్వబావము కలవారై వుండును. ఈ కుజుడు లగ్న స్థానము, ధన స్థానము మరియు కర్మ స్థానముపై పూర్ణ దృష్టిని ప్రదానించును. కుజుని యొక్క దృష్టి కారణముగా ఆర్ధిక సంఘటము, వర్తక వ్యాపారములలో హాని లేదా దుర్గటనలు కలుగుట అవకాశములు వుండును. ఈ కుజ గ్రహము చరిత్రపై కూడా కలంకములను తీసురావచ్చును. సంతానము యొక్క సందర్బములో కూడా ఇది కష్టకారిగా వుండును. కుజుని అశుభ ప్రభావము కారణముగా బార్యా భర్తల మద్య వడిదుడుకులు ఏర్పడి వారు ఇరువురు విడిపోయే అవకాశములు ఏర్పడవచ్చును. కుండలిలో యది కుజుడు ఈ బావములలో కుజదోషము కారణముగా పీడించబడి వున్న ఎడల దీనికి ఉపాయములను చేయవలసి వుండును.

అష్టమ బావములో కుజుడు (Mangal in Eigth house)
అష్టమ బావము దు:ఖము, సంఘటము, ఆయువు యొక్క గృహముగా చెప్పబడుతున్నది. ఈ బావములో కుజుడు వైవాహిక జీవితములోని సుఖములను నాశనము చేయును. అష్టమస్థ కుజుడు మానసిక పీడ మరియు కష్టములను ప్రదానించువాడగును. జీవిత బాగస్వామి యొక్క సుఖములో బాదలను కలిగించును. ధన బావములో దీని దృష్టి వుండుట కారణముగా ధన హాని మరియు ఆర్ధిక కష్టము కలుగును. రోగముల కారణముగా దాంపత్య సుఖము బాదించబడును.  జ్యోతిష్య విధానమునకు అనుసారముగా ఈ బావములో కూర్చొని వున్న అమంగళ కారుడైన కుజుడు శుభగ్రహములను కూడా శుభకరమును ప్రదానించుటలో సమస్యలను కలిగించును. ఈ బావములో కుజుడు యది వృషభము, కన్యా లేదా మఖర రాశిలో వుండిన ఎడల దీని అశుభత కొంతవరకు తగ్గవచ్చును. మఖర రాశిలో కుజుడు వుండిన ఎడల సంతాన సంబందమైన కష్టములు కలుగును.

ద్వాదశ బావములో కుజుడు (Mangal in Twelth Bhava)
ద్వాదశ బావము కుండలిలో సుఖము, బోగము, నిద్రా, యాత్ర మరియు వ్యయమును నిర్దేశించును. ఈ బావములలో కుజుని ఉపస్థితిలో వుండిన ఎడల కుజ దోషము కలుగును.  ఈ దోషము కారణముగా బార్యా భర్తల మద్య గల సంబందములలో వొడిదుడుకులు ఏర్పడగలవు. వ్యక్తిలో కామ ప్రధమైన కోరికలు అధికముగా వుండును. యది గ్రహముల శుభ ప్రభావము లేని ఎడల వ్యక్తి నడవడికలో దోషము కూడా కలుగవచ్చును. ఆవేశలోకి వచ్చి జీవిత బాగస్వామికి నష్టములను కూడా కలిగించవచ్చును. వీరిలో గుప్త రోగములు మరియు రక్త సంబంద దోషములకు అవకాశములు వుండును.
కుజ, పుత్ర దోషాలు అంటే ఏమిటో తెలుసా

ఏలినాటి శని ప్రభావం తరహాలో కుజ దోషమంటేనే అందరూ భయపడటం సహజం. కానీ కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతుంది. 
సాధారణంగా కుజ దోషమంటే కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో, చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ కుజదోష జాతకులిరువురు వివాహం చేసుకోదలచుకుంటే జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
జాతకంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషం తప్పక ఉన్నట్టే. పై స్థానాల్లో కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లయితే.., లేదంటే ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషానికి పరిహారాలున్నాయి.
కాగా కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకోవాలంటే.. 
1. జాతకం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికి ఒకే విధమైన పూర్ణవంతమైన దోషాన్ని కలిగి ఉండాలి. (లేక)
2. స్త్రీ , పురుషులకు ఎటువంటి పూర్ణవంతమైన దోషం ఉండకూడదు.
పై రెండు లేని పక్షంలో ఇద్దరికి కుజదోషపరిహారం చేసుకునే మార్గమైనా ఉండితీరాలి.
ఇంకా కుజుని దశ ఇద్దరికి ముగించే స్థాయిలోనైనా కుజదోషస్థులు వివాహం చేసుకోవచ్చు.

ఇక పుత్ర దోషం - పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి. ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది.
ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే "నాగదోషమని" పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన పక్షంలో నాగదోషం తొలగిపోవటంతో పాటు పుత్రప్రాప్తి లభిస్తుంది.
పరిహారాలు :
1. పుత్ర దోషం కలవారు నాగ విగ్రహ సమేతంగా గల వేపచెట్టు, మర్రి చెట్టులను 41 రోజులు ప్రదక్షిణ చేయాలి. 41 వరోజు అర్చన చేయాలి. 
2. వెండితో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం (41రోజులు) పూజచేసి శివాలయాల్లో సమర్పించటమో లేక హుండీలలో వేయటమో చేయాలి. 
3. రామేశ్వరం, శ్రీ కాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలలో నాగదోష నివారణకు పూజలు చేసి పరమేశ్వరుని ధ్యానించటం ద్వారా పుత్రప్రాప్తి లభించటంతో పాటు పుత్రదోషం తొలగిపోతుంది

కుజ దోషం
ఇది ఒక కొలబద్ద అని పోల్చవచ్చు. జ్యోతిశ్శాస్తవ్రేత్తలు అదే రీతిగా చెప్పారు. అయితే కుజదోషం అని పేరు ఉన్న కారణంగా అదొక భూతంలాగా అందరికీ కనపడుతుంది. అయితే సంఘంలో ఎవరికి తోచిన మాటలు వారు చెప్పుకుంటూ పోతూ వున్న కారణంగా శాస్త్రంలో అసలు దీనిని ఎందుకు రూపొందించారు అనే విషయం కూడా పరిశీలన మానివేశారు. సినిమాలో కూడా దీనికి ప్రాచుర్యం ఎక్కువ కలుగజేశారు. (సంఘంలో ఆడ, మగ అనే రెండు వర్గాల వారు పుడతారు. అలాగే కుజదోషం ఉన్నవారు, కుజదోషం లేనివారు అనే రెండు వర్గాల వారు జ్యోతిశ్శాస్త్ర విధానంగా పుడతారు) కుజదోషం ఉన్నవారు కుజదోషం వున్నవారి కోసం వెదకాలి. కుజదోషం లేనివారు కుజదోషం లేనివారి కోసం వెదకాలి. ఇదే మహర్షులు చెప్పింది. కుజదోషం విచారణ చేయవలసిన వారు ఎవరు? సిద్ధాంతులు. మరి వారు చేయవలసిన పని పబ్లిక్‌లో అందరూ చేస్తున్నారు. కుజదోషం గురించి సంభాషించుకుంటూ మనం శాస్త్రం గురించి చదవలేదు కదా! మనం ఎందుకు సంభాషించుకోవాలిఅనే జ్ఞానం కూడా లేకుండా చర్చలు సాగించి కుజదోషాన్ని ఒక పెద్ద భూతం మాదిరి చేసి సంఘానికి చూపారు.
అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయు సందర్భంలో ఇరువురికీ పొంతనలు చూడటం కోసం సిద్ధాంతుల కోసం ఏర్పరచిన కొలమానమే కుజదోషం. కుజదోషం ఉంటే వివాహం ఆలస్యమవుతుంది అని ఒక ప్రచారం ఉంది. శాస్త్ర దూరమైన అంశం. మరి కుజదోషం ఉండి చిన్న వయసులో సకాలంలో వివాహమైన వారు ఎందరో ఉన్నారు. అలాగే కుజదోషం ఉంటే భార్యాభర్తలు విడిపోతారు అని మరొక నానుడి. భార్యాభర్తలు విడిపోవడానికి కుజదోషం ఒక్కటే కారణం కాదు.
కుజుడు అనారోగ్య కారకుడు. కలహకారకుడు. అటువంటి వాడు లగ్నంలో ఉంటే కళత్ర భావమును చూస్తాడు. అలాగే వ్యయంలో వుంటే కళత్ర భావంను చూస్తాడు. కుటుంబ స్థానాన్ని చూడరాదు. చతుర్థంలో ఉంటే కళత్ర స్థానాన్ని చూస్తాడు. అష్టమంలో కుటుంబ స్థానాలలో ఎక్కడ ఉన్నా కుటుంబ స్థానాన్ని చూస్తాడు. ఇటువంటి సందర్భంలో కుటుంబ కళత్ర స్థానాలతో ఆయనకు చూపు, స్థితి వంటివి వుంటే కలహాలు సృష్టించి కుటుంబ జీవనం పాడుచేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన స్పర్శ కుజదోషంగా ఉన్న జాతకులకు అటువంటి జాతకులతోనే వివాహం చేయమని, కుజదోషం లేనివారికి కుజదోషం లేని వారితోనే వివాహం చేయమని మహర్షి వచనం. మరి కుజదోషం అని ఎందుకు వచ్చింది అంటే కుజుడు దోషాలను కలుగజేసే సంచారంలో వున్నారు కావున దానికి కుజదోషం అని పేరు పెట్టారు. చాలా గ్రంథాల సమీకరణ ద్వారా ఎన్నో సూత్రాలు ఈ కుజదోషం గురించి చెప్పారు. అలాగే కొన్ని గ్రహాల స్థాన సంచారం దృష్ట్యా కుజదోషం పరిహారాలు చెప్పారు. దోష పరిహారాలు అంటే లగ్నాత్ కుజుడు ఏయే స్థానాలలో ఉంటే కుజదోషం ఉన్నది అని చెప్పారో ఆ కుజుడికి ఇతర గ్రహాల యుతివీక్షణల దృష్ట్యా దోషం తగ్గుతుంది అనే అంశాలు చెప్పారు. ఇలా ఎన్నో విశేషాలు గ్రహ సంచారం దృష్ట్యానే చెప్పారు. వీటిని అన్నింటినీ సమీక్షించి చేయు నిర్ణయం మీద వివాహం చేసుకోబోయే దంపతుల జీవన శైలి నిర్ణయించారు. కుజదోషం అమ్మాయికి వుండి అబ్బాయికి లేకపోయినా, అబ్బాయికి ఉండి అమ్మాయికి లేకపోయినా వారి దాంపత్యం సరిగా ఉండదు అని శాస్త్రం చెప్పింది. వీటిని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్య పూజలు, ఇతర పూజలు వంటివి చేయడం వలన దోషం పోతుంది అని చెబుతారు. అది సమంజసం కాదు. శాంతి మార్గం ముందు చక్రంలో వున్న గ్రహాలు శాంతి మార్గం తరువాత చక్రంలో గ్రహాలు ఒకే రీతిగా ఉంటాయి. లగ్నాత్ అష్టమంలో కుజుడు పెద్ద కుజదోషం జన్మతః ఉంది అనుకోండి. మనకు ఆ జాతక చక్రం ఎన్నిసార్లు ఏ వయసులో చూసినా లగ్నాత్ కుజుడు కుజదోషంగా అక్కడే ఉంటాడు. శాంతి తరువాత అష్టమంలో కుజుడు వున్నా కుజదోషం లేదు అనడానికి ఆధారం ఏది? మనం ఏమీ చక్రం మార్పు చేయలేం. పుట్టిన సమయానికి వున్న గ్రహచారం మార్పు చేయలేం. జన్మతః జాతక చక్రం ద్వారా వచ్చిన గ్రహచారం చచ్చేవరకు అలాగే ఉంటుంది. మరి ఈ శాంతులు ఉన్నాయా? వాటి ప్రభావం ఉంటుందా? వంద శాతం ఉంటుంది. కుజదోషం వలన కలుగు దుష్ప్రభావాల నుండి మనిషి ధైర్యంగా ఎదుర్కొనగల శక్తి లభిస్తుంది. సమస్యా పరిష్కార మార్గాలు వెదకగల శక్తి వస్తుంది. అంతేకాక కుజదోషం వలన కలహాలు వస్తాయి. ఆ కలహాల స్థాయి తగ్గుతుంది. అయితే కుజదోషం ఒకటి కుటుంబ విచ్ఛినాలకు, వివాహ ఆలస్యాలకు కారణం కాదు. కుటుంబ, భాగ్య కళత్ర యోగాలను పరిశీలించి సంబంధం నిర్ణయించాలి. ఇది జ్యోతిశ్శాస్తవ్రేత్తల పని. కుజదోషం గురించి భయపడరాదు. *

కుజ దోషము-పరిహారములు
ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు.  ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు.  కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు.  మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు.  శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు:  రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట  కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది
వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ  ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.
·              సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.
·              ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి  డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
·              కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి.  కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
·              స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
·              ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
·              ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.
·              ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
·              పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
·              షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
·              కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
·              కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
·              రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
·               
·              కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
·              కుజదశలో కుజుని  అంతర్దశకు....ఉత్తరకాండ   ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
·              కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ   యాభై ఎనిమిదవసర్గ,   తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
·              కుజ దశలో కేతు అంతర్దశకు--     యుధకాండ   నూట పదహారు సర్గ ,   ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
·              కుజ దశలో శని అంతర్దశకు --      అరణ్యకాండ   డెభై వ సర్గ --             నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
·              కుజుదశలో బుధ అంతర్దశ ---        బాలకాండ పదహారవసర్గ   --           ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
·              కుజు దశలో గురు అంతర్దశ --        సుందర కాండ యాభై ఒకటి సర్గ---     అరటిపండ్లు నైవేద్యము.
·              కుజ దశలో శుక్ర అంతర్దశకు ---      సుందరాకాండ యాబై మూడు సర్గ --   పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
·              .
·              కుజ దశలో రవి అంతర్దశకు ---       బాలకాండ ఇరై మూడు సర్గ --           చామ కారెట్ దుంప నైవేద్యము.
·              కుజదశలో రవి అంతర్దశకు ---        బాలకాండ పదిహేడవ సర్గ--              పాలు, పాయేసం నైవేద్యము
·              కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
·              సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
·              ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
·              బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
·              మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
·              స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
·              ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
·              కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
·              రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
·              పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
·              రక్త దానము చేయుట చాల మంచిది.
·              అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
·              కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
·              రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
·              కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
·              కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
·              ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
·              కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
·              వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
·              భావము:  వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu
·              భావము:  వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో  చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
·              భావము:  వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
·              భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
·              భావము:  వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి..
·              భావము:  అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
·              భావము:  మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
·              భావము:  నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
·              భావము:  కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.
·              భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.
·              భావము:  చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
·              భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
·              -- ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు
కుజ దోషం నివారణ మార్గం -ఏది ఎలా ఎప్పుడు చేయాలి?

మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని  నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.

             
వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని  అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది

               
అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి  అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి

జాతకంలో శనిరాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్ప దోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపిత యోగం అని అంటారు.కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు.కొంతమంది అయితే ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి ఇష్టపడరు.

గోచార రీత్యా వీరిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా ఇదే దోషం ఏర్పడుతుంది.వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని జరగదు.కాని అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో చాలా ఘోరాలు జరుగుతాయి.

ఆ సమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం రకరకాలుగా ప్రతిఫలిస్తుంది. ఆయా జాతకులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాలసర్ప యోగం ఎంత బాధ పెడుతుందో ఈ యోగమూ అంత కంటే ఎక్కువ బాధ పెడుతుంది. అయితే అది బాధించే తీరూ ఇది బాధించే తీరూ వేర్వేరుగా ఉంటాయి.

ప్రస్తుతం వీరిద్దరూ 2012 డిసెంబర్ 24 నుంచి 2014 జూలై 13 వరకూ తులా రాశిలో కలిసి ఉంటారు.ఈ సమయమంతా దోషప్రదమే.ఈ ఏడాదిన్నర పాటు లోకం రకరకాల ఉపద్రవాలతో తల్లడిల్లక తప్పదు. ఈ సమయంలో పుట్టే పిల్లల జాతకాలలో ఈ దోషం తప్పకుండా ఉంటుంది. కనుక పెరిగి పెద్దయ్యాక వారి జీవితాలలో వారు చాలా చెడు ఖర్మను అనుభవించక తప్పదు. గతజన్మలో చాలా పాపఖర్మల బరువు ఉన్న జీవులు ఈ సమయంలో భూమిమీద జన్మ తీసుకుంటారు.

దీనిని శపిత దోషం అని ఎందుకంటారు? ఈ జాతకులకు చాలా శాపాలు ఉంటాయి. గత జన్మలలో వీరు అనేక చెడుకర్మలు చేసుకుని అనేక మంది ఉసురుపోసుకుని వారి శాపాలకు గురై ఉంటారు.పూర్వజన్మలలో చేసుకున్న చెడుఖర్మల ఫలితంగా ఈ జన్మలో అనేక కష్టాలు బాధలు పడవలసి వస్తుంది.అహంకారంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న  చెడుఖర్మ ఈ రకమైన దోషంగా జాతకంలో ప్రతిఫలిస్తుంది.

శపిత దోషం ఉన్న జాతకాలు చూచి వారికి రెమేడీలు చెప్పిన జ్యోతిష్కుడు కూడా ఆ కర్మలో భాగం పంచుకోవలసి వస్తుంది. పరిహారాలు చేసిన జోస్యునిపైన రాహు,శనుల కోపదృష్టి పడుతుంది. జాతకుని తీవ్ర కర్మలో జోస్యుడు జోక్యం చేసుకుంటున్నాడు కనుక అతనూ ఆ కర్మను కొంత పంచుకోవలసి వస్తుంది.

ఒకసారి ఒక ముసలి జ్యోతిష్కుని నేను చూచాను. ఒక జాతకాన్ని తన చేతిలోకి తీసుకుని చూచీ చూడక ముందే ఆ కాగితాన్ని విసిరి పారేసాడు.ఆ జాతకం తాను చూడననీ, ఆ జాతకున్ని వెళ్ళిపోమ్మనీ అరిచాడు. ఉత్త పుణ్యానికి అలా ఎందుకు అరుస్తున్నాడో నాకు అర్ధం కాలేదు.తర్వాత చెప్పాడు అది శపిత దోషం ఉన్న జాతకం మనం దానిని చూడరాదు.విశ్లేషించరాదు అని.  

పన్నెండు రాశులలో దేనిలో ఈ దోషం ఏర్పడింది? దీనిపైన మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నది? అన్న దానిని బట్టి ఈ దోష తీవ్రతను జాతకుని పూర్వకర్మను అంచనా వెయ్యాలి.

ఈ యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడు తీవ్రమైన కోపానికి,నిలకడలేని ప్రవర్తనకు లోనవుతాడు.తట్టుకోలేని కోపంలో హత్యలు రేపులు చేసేవారు, ఉన్నట్టుండి తీవ్ర నిర్ణయాలు తీసుకునే వారిలో ఈ దోషం ఉంటుంది.వీరిలో విచక్షణ లోపిస్తుంది.మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలు తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారు.శనిరాహువుల సంయోగం అలాంటి ప్రవర్తనను ప్రేరేపిస్తుంది.తట్టుకోలేని భావోద్రేకాలను,మొండితనాన్ని, మూర్ఖపు వాదనలను,ఒంటరిగా ఉండి క్రూరమైన ప్లానులు వెయ్యడాన్ని ఈ గ్రహసంయోగం కలిగిస్తుంది.స్నేహితుల మధ్యన,ప్రేమికుల మధ్యన, అప్పటివరకూ కలిసిమెలిసి తిరిగిన వారిమధ్యన,హటాత్తుగా గొడవలు రావడం ఈ దోషం యొక్క ప్రభావమే.

డిల్లీ రేప్ కేస్ గాని,తర్వాత జరుగుతున్న ఇతర రేపులు హత్యలు ఘోరాలు గాని,యాక్సిడెంట్లు గాని,అన్నీప్రస్తుతం గోచారరీత్యా అమలులో ఉన్న ఈ యోగం యొక్క  ఫలితాలే. అంతేకాదు,అక్బరుద్దీన్ ఉదంతం గాని,పాకిస్తాన్ దుందుడుకు చర్యలు గాని,సరిహద్దులో మనల్ని రెచ్చగొట్టడం గాని,పాకిస్తాన్లో సంక్షోభం గాని ఇవన్నీ ఈ గ్రహయుతి యొక్క ఫలితాలే. 

చాలామంది జీవితాలలో జూలై 2014 లోపు ఈ గ్రహదోషం చుక్కలు చూపించి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది అనడం నగ్నసత్యం. వేచి చూడండి ఫలితాలు ఎవరి జీవితాలలో వారికే కనిపిస్తాయి.
జ్యోతిష్యం అనేది భారతదేశములో ఉన్న శాస్త్రములలో ఒక గొప్ప శాస్త్రము.  భారతదేశంలో ఎందరో  ఋషులు ఈ జ్యోతిష్య శాస్త్రమును చాలా గొప్పగా అభివృద్ధి చేశారు.  వారి దివ్య చక్షువులు ద్వారా ఆకాశంలో ఎక్కడో దూరంగా కంటికి కనిపించనంత దూరంలో ఉన్న గ్రహాలను, వాటి స్వరూపాలను, వాటి విశిష్టతను తెలియజేసారు.   జ్యోతిష్య శాస్త్రము
౧.  సిద్ధాంత భాగము 
౨. జాతకభాగము 
౩.  ముహూర్తభాగము
అను మూడు భాగాలుగా తెలియజేయబడి వున్నది.  పూర్వము అనేకమంది మహర్షులు   జ్యోతిష్య శాస్త్రములో అనేక గ్రంథాలు రచించి వున్నారు. వారిలో బ్రహ్మ, వశిష్టుడు, అత్రి, గౌతముడు, మనువు, కాళిదాసుపౌలస్తుడు, రోమసుడు, మరీచి, అంగీరసుడు, వ్యాసుడు, నారదుడుశౌనకుడుభ్రుగువు, చ్యవనుడు, యవనుడు, గర్గుడు, కశ్యపుడు, పరాశరుడు మొదలైనవారు ముఖ్యులుగాను యింకా మరెందరో వున్నారు.  ముఖ్యముగా ఈ జోతిష్య శాస్త్రములో పరాశర, జైమిని, శ్రీపతి అను మూడు పద్ధతులు వాడుకలో వున్నవి. నేడు  మనదేశములో పరాశరపద్ధతి ఎక్కువ వాడుకలోను, ఎక్కువగా ప్రజాదరణ పొందినదిగా చెప్పవొచ్చును.   జైమిని మహర్షి రచించిన జైమినిపద్ధతి కూడాను వాడుకలో వున్నది.  కొందరు పరాశర, జైమిని రెండు పద్ధతులను కలిపి ఫలితాలు  చెప్పిరి.  మనము చేయు ప్రతి పని కూడాను కర్మగా చెప్పవొచ్చును. మరి ఆ కర్మనే వృత్తి  గా పిలువబడుతున్నది.  తాము పూర్వజన్మలో చేసిన కర్మఫలితములను బట్టి ఈజన్మలో శుభాశుభ ఫలితాలుగా పొందుతున్నారు.

చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.
 
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజదోషము-పరిహారములు :

కుజగ్రహము గురించి: కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు

ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం || 
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
 

మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది.
 
వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.
సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.
  
ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
 
కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టిదక్షిణ, తాంబూలాలతో   దాన                                                       మివ్వాలి.             

స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.

ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.                    

ప్రతిరోజు సుబ్రహ్మణ్య,               దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.

కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.

కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం.
కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము
 
కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన            సరే దానం ఇవ్వాలి.
కోతులకు తీపి             పదార్థములు తినిపించాలి.
రాగి పాత్రలో నీరు            తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
పోట్లకాయలు తరగటం,            మంచిది కాదు.
రక్త దానము               చేయుట చాల మంచిది.
అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ                    దానం మంచిది.
కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క                ఉంచి కుజుని ఆరాధించాలి.
ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప         దానము చేసిన సమస్య తొలగును.
వివిధ భావాలలో కుజదోషం         ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
భావము: వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu.
 
భావము: వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
భావము: వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
భావము: వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు              దక్షిణం వైపు నాటాలి..
భావము: అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
భావము: మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
భావము: నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
భావము: కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు          చెప్పినవి చేయాలి.
భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో            పదనీకండి.
భావము: చిన్న మట్టి పాత్రలో          తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
--
ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు



No comments:

Post a Comment